హైదరాబాద్ : భారత్, ఇంగ్లాండ్ మధ్య ఇటీవలే రద్దయిన ఐదో టెస్టును మళ్లీ నిర్వహేంచేందుకు ఇరు దేశాల క్రికెట్ బోర్డుల మధ్య అంగీకారం కుదిరింది. వచ్చే ఏడాది ఆగస్టులో పరిమిత ఓవర్ల సిరీస్లో పాల్గొనేందుకు ఇంగ్లాండ్ పర్యటనకు భారత్ వెళ్లనుంది. కావున ఆ సమయంలో ఈ టెస్టు మ్యాచ్ ను నిర్వహించనున్నారు.
ఐదు టెస్టు సిరీస్లో భాగంగా చివరి మ్యాచ్ ఈ నెల 10-14 తేదీల్లో జరగాల్సి ఉండగా.. భారత శిబిరంలో కరోనా కేసులు నమౌదైన క్రమంలో ఆడేందుకు భారత ఆటగాళ్లు నిరాకరించారు. దాంతో మ్యాచ్ ను తాత్కాలికంగా రద్దు చేశారు. ఈ సిరీస్లో టీమ్ఇండియా 2-1 ఆధిక్యంలో నిలిచింది. ఐదో మ్యాచ్పై స్పష్టత లేకపోవడం వల్ల సిరీస్ ఫలితం కూడా ఇంక తేలలేదు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 26 Sep,2021 11:50AM