హైదరాబాద్ : యాదాద్రి జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. బీబీనగర్ టోల్ ఫ్లాజ్ సమీపంలో లారీని వెనక నుంచి బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై ప్రయాణిస్తున్న దంపతుల్లో భర్త బాలరాజు అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. భార్య,కూతురి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు జనగామ జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటనతో మృతిడి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Mon Jan 19, 2015 06:51 pm