హైదరాబాద్: నగరంలోని ఎస్.ఆర్.నగర్, అమీర్పేట్లో టాస్క్ ఫోర్స్ గంజాయి ముఠాను అరెస్ట్ చేశారు. టాస్క్ ఫోర్స్ పోలీసులు తనిఖీలు చేస్తుండగా గంజాయి అమ్మడానికి ప్రయత్నిస్తున్న ఏడుగురు వ్యక్తులను టాస్క్ ఫోర్స్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. నిందితుల నుంచి సుమారుగా 1.2 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో 6 మంది పురుషులు, ఒక మహిళ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి ఎస్.ఆర్. నగర్ పోలీస్ స్టేషన్కు తరలించారు.
Mon Jan 19, 2015 06:51 pm