कल गरबा आज भोपाल सांसद @SadhviPragya_MP आज मां काली के दर्शन के लिए पहुंचीं,वहां ग्राउंड में मौजूद खिलाड़ियों के अनुरोध पर महिला खिलाड़ियों के साथ कबड्डी खेली।😊 pic.twitter.com/X1wWOg55aW
— Anurag Dwary (@Anurag_Dwary) October 13, 2021
హైదరాబాద్ : అనారోగ్య కారణాలతో బెయిలుపై విడుదలైన ఆ ఎంపీ కబడ్డి ఆడడం వివాదాస్పదమైంది. పూర్తి వివరాల్లోకెళ్తే.. భోపాల్ ఎంపీ, బీజేపీ నేత ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ మాలెగావ్ పేలుళ్ల కేసు నిందితురాలు. తాను వీల్చైర్కే పరిమితమైనట్టు కోర్టుకు తెలిపారు. దాంతో ఆమె అనారోగ్య కారణాలతో ఉందని కోర్టు బెయిల్ ఇచ్చింది. ఇదిలా ఉండగా శుక్రవారం రాత్రి భోపాల్లోని సింధి వర్గం ఏర్పాటు చేసిన దుర్గా పూజలో పాల్గొన్న ఎంపీ అక్కడ ఏర్పాటు చేసిన కబడ్డీ పోటీల్లో ఆమె కాసేపు సరదాగా ఆడారు. ఆమె కూతకు వెళ్లిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. దాంతో దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి. ఆమె అసలు రూపం ఇదేనంటూ మధ్యప్రదేశ్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి కేకే మిశ్రా కామెంట్ కూడా చేశారు.అయితే తాను కబడ్డీ కూతకు వెళ్లిన వీడియో వైరల్ కావడంపై ప్రజ్ఞాసింగ్ స్పందించారు. ఆ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేసిన వ్యక్తిని రావణుడితో పోల్చారు. అతడు వృద్ధాప్యంలో, వచ్చే జన్మలో నాశనమైపోతాడని శపించారు.