హైదరాబాద్ : తమసోమ జ్యోతిర్గమయ ట్రైలర్ చూస్తే వేదం సినిమా గుర్తొస్తోందని దర్శకుడు క్రిష్ జాగర్లమూడి అన్నారు. యువ దర్శకుడు విజయ్ కుమార్ బడుగు రూపొందించిన చిత్రం 'తమసోమా జ్యోతిర్గమయ`. ఈ చిత్రం ద్వారా ఆనంద్ రాజ్, శ్రావణిశెట్టి హీరో హీరోయిన్లుగా పరిచయమవుతున్నారు. విమల్ క్రియేషన్స్ బ్యానర్ పై తడక రమేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా గుణ ఎంటర్ టైమెంట్స్ పతాకంపై సమర్పిస్తున్నారు. తాజాగా దర్శకుడు క్రిష్ జాగర్లమూడి మాట్లాడుతూ చక్కటి మాటలతో, కనువిందు చేసే గ్రామీణ దృశ్యాలతో, చేనేత, చేతి వృతుల్లో ముఖ్యంగా యువతలో సామాజిక స్పృహను కల్పించే విధంగా ఈ చిత్రాన్ని దర్శకుడు రూపొందించాడన్నారు. ట్రైలర్ లో 'ఊరుని నేను చూస్తున్నట్టు లేదు అని.. ఊరే నన్ను చూస్తున్నట్టు ఉంది` అని చెప్పే మాట మనలో కొత్త ఆలోచనల్ని కలిగిస్తుందన్నారు. ఈ నెల 29న విడుదల అవుతున్న ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకోవాలని కోరుకుంటున్నానని తెలిపారు. మార్క్ కె ప్రశాంత్ ఈ చిత్రానికి అందిస్తున్నారు.
ఈ సినిమాలో జనర్ధాన్, ఆర్ కే ముఖ్య పాత్రలు పోషిస్తుండగా, చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా సాయి కార్తిక్ వ్యవహరిస్తున్నారు. డీఓపీ, ఎడిటింగ్ శ్రావణ్ కాగా విజయ్ కుమార్ బడుగు, సైనీ భరత్ లు ఆర్ట్ డైరక్టర్లుగా వ్యవహరిస్తున్నారు. అశోక్ కుమార్, ప్రశాంత్, సాయి చరణ్, రంజని శివ లు లిరిక్స్ అందించగా సురేష్ కొండేటీ పీఆర్ఓ గా వ్యవహరిస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 17 Oct,2021 12:13PM