నల్లగొండ: సెల్ఫీ సరదా ఇద్దరు స్నేహితుల ప్రాణం తీసింది. మిత్రులిద్దరూ సెల్ఫీ తీసుకుంటూ పొరపాటున నీళ్లలో పడి మరణించిన ఘటన నల్గొండ జిల్లాలో వెలుగు చూసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జహీరాబాద్కు చెందిన సాగర్, ప్రవీణ్ ఇద్దరూ స్నేహితులు. మల్లికార్జున స్వామిని దర్శించుకునేందుకు శ్రీశైలం వెళ్లారు. తిరిగి వస్తూండగా నల్గొండ జిల్లాలోని డిండి జలాశయం వద్ద ఆగారు. అక్కడ సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించారు. ఆ సమయంలోనే పొరపాటున ఇద్దరూ జలాశయంలో పడి మృతి చెందారు.
Mon Jan 19, 2015 06:51 pm