హైదరాబాద్: హుజురాబాద్లో కొత్తగా గంజాయి ఇచ్చి ఓట్లు అడుగుతున్నారని సీపీఐ నేత చాడ వెంకట్రెడ్డి ఆరోపించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ హుజురాబాద్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగట్లేదని, దుర్మార్గపు ఎన్నికలు జరుగుతున్నాయని విమర్శించారు. దేశ భవిష్యత్ను పాడుచేసే విధంగా ప్రధాని మోదీ పాలన సాగిస్తున్నారని దుయ్యబట్టారు. ప్రభుత్వ రంగాలను తక్కువకే ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తున్నారని ఆరోపించారు. రైతులను బజారుపాలు చేసే చట్టాలు తెచ్చారని ధ్వజమెత్తారు. మోదీ పాలనలో రైతుల బతుకులు దారుణంగా తయారయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఉద్యోగాలు లేవని, నిరుద్యోగ భృతి అసలే లేదని చాడ వెంకట్రెడ్డి తప్పుబట్టారు.
Mon Jan 19, 2015 06:51 pm