- బడి పిల్లలకు బస్సు సౌకర్యం
నవతెలంగాణ-గోవిందరావుపేట
బడి పిల్లలు పడుతున్న ఇబ్బందులను సర్పంచ్ వివరించగా బస్సు సౌకర్యం ఏర్పడింది. మండలంలోని ధూమ్ పల్లి గూడెం గ్రామం నుండి ప్రతిరోజు 80 మంది విద్యార్థులు మండలంలోని చల్వాయి మోడల్ పాఠశాలకు విద్య అభ్యసించేందుకు వెళ్తుంటారు. ప్రతి రోజు వీరు పలు వాహనాల లో వెళుతున్న ఇబ్బందులను విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు సర్పంచ్ భూక్యా రాజు వాణి లకు వివరించారు. దీనితో సర్పంచ్ పలుమార్లు వరంగల్ టూ డిపో అధికారులతో విద్యార్థుల సమస్యలను వివరించారు. దీని ఫలితంగా బుధవారం గ్రామానికి విద్యార్థుల కొరకు బస్సు సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి అధికారులు తెలపడమే కాకుండా బస్సును పంపడం కూడా జరిగింది. దీంతో విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేయడంతోపాటు వరంగల్ టూ డిపో అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. పాఠశాల సమయం ప్రకారం బస్సు రావడంతో విద్యార్థుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ప్రయత్నించిన సర్పంచ్ కి ఉపసర్పంచ్ జనార్దన్ రెడ్డి కి కూడా వారు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు గ్రామస్తులు కొంపెల్లి శ్రీనివాసరెడ్డి కొమురయ్య రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 20 Oct,2021 06:40PM