హైదరాబాద్ : టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయ్. తాజాగా టీడీపీ నేత నారా లోకేశ్ మాట్లాడుతూ రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి మాఫియా పెరిగిందని అన్నారు. దేశంలో ఎక్కడ డ్రగ్స్, గంజాయి పట్టుబడినా... దాని మూలాలు ఏపీలో ఉంటున్నాయని చెప్పారు. ఏపీ నుంచే గంజాయి ఎక్కువగా వస్తోందని సాక్షాత్తు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ చెప్పారని అన్నారు. డ్రగ్స్ పై పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారని... ఏపీ సీఎం జగన్ మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడలేదని విమర్శించారు. గంజాయిని నివారించాలనే ఆలోచన పోలీసులకు లేదని చెప్పారు. టీడీపీ కార్యాలయంలో నాలుగు అద్దాలు పగిలినంత మాత్రాన తాము భయపడబోమని నారా లోకేశ్ అన్నారు. రాబోయే రోజుల్లో మీ వీపులు పగులుతాయని హెచ్చరించారు.
Mon Jan 19, 2015 06:51 pm