హైదరాబాద్: శిల్పా చౌదరిపై మరో కేసు నమోదైంది. ప్రియా అనే మహిళ ఫిర్యాదు మేరకు నార్సింగి పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రియా వద్ద 2.5 కోట్ల రూపాయలను శిల్పా చౌదరి తీసుకున్నట్టు తెలుస్తోంది. తమ పిల్లల వివాహం కోసం దాచుకున్న డబ్బులను శిల్పాకు బాధితురాలు ఇచ్చింది. అధిక వడ్డీ ఆశతో శిల్పాకు బాధితులు డబ్బులు ఇచ్చారు. గత రెండు సంవత్సరాలుగా కనీసం శిల్పా వడ్డీని కూడా కట్టలేదని ప్రియా ఆరోపిస్తోంది.
Mon Jan 19, 2015 06:51 pm