విజయవాడ: ఏపీ ఉద్యోగ సంఘాల నేతలు అత్యవసరంగా సమావేశమయ్యారు. రెవెన్యూ భవన్లో అమరావతి జేఏసీ, ఏపీఎన్జీవో భవన్లో ఎన్జీవో జేఏసీ కార్యవర్గ సభ్యులు విడివిడిగా భేటీ అయ్యారు. పీఆర్సీ అమలు, సీపీఎస్ రద్దు, కాంట్రాక్టు కార్మికుల క్రమబద్దీకరణ తదితర డిమాండ్లతో పాటు వివిధ సమస్యలపై సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. పీఆర్సీపై ఇప్పటికే డెడ్లైన్ విధించిన ఏపీ జేఏసీ నేతలు సమావేశం ముగిసిన తర్వాత భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm