ముంబయి : కెజిఎఫ్-2 సినిమా టీంకు బాలీవుడ్ నటుడు అమీర్ఖాన్ క్షమాపణలు చెప్పారు. అందుకు కారణం ఏంటంటే.. అమీర్ఖాన్ కథానాయకుడిగా, కరీనా కపూర్, నాగచైతన్య కీలక పాత్రల్లో అద్వైత్ చందన్ దర్శకత్వం వహించిన సినిమా 'లాల్సింగ్ చద్దా` ఏప్రిల్ 14, 2022న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే, అదే రోజున తమ సినిమాను విడుదల చేయనున్నట్టు 'కేజీయఫ్2` చిత్ర బృందం గతంలోనే ప్రకటించింది. దీంతో రెండు భారీ చిత్రాలు ఒకే రోజున విడుదల కావడంతో బాక్సాఫీస్ వద్ద క్రాష్ ఏర్పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కేజీయఫ్2 నిర్మాత విజయ్ కిరంగదుర్, దర్శకుడు ప్రశాంత్ నీల్, కథానాయకుడు యశ్లకు క్షమాపణ చెబుతూ, తన పరిస్థితి వివరిస్తూ లేఖరాశానని అమీర్ ఖాన్ తాజాగా తెలిపారు.
తాజాగా అమీర్ఖాన్ మాట్లాడుతూ.. 'లాల్సింగ్ చద్దా బైసఖి రోజున (ఏప్రిల్ 14)న విడుదల కానుంది. అయితే అదే రోజున కెజిఎఫ్-2 సినిమా కూడా విడుదల కానున్నట్లు ప్రకటించారని తెలిసింది. ఈ విషయం తెలిసి ఉద్దేశపూర్వకంగా తాము ఆ రోజును ఎంచుకోలేదు. లాల్ సింగ్ చద్దా విడుదల తేదీని ప్రకటించే ముందు కేజీయఫ్2 నిర్మాత విజయ్ కిరంగదుర్, దర్శకుడు ప్రశాంత్ నీల్, కథానాయకుడు యశ్లకు క్షమాపణ చెబుతూ, తన పరిస్థితి వివరిస్తూ లేఖరాశాను. నిర్మాత పాలిట లాక్డౌన్ ఎలాంటి క్లిష్ట పరిస్థితిని తీసుకొచ్చిందో చెపానని, వాళ్లు కూడా అర్థం చేసుకున్నారని, తమ నిర్ణయానికి మద్దతు తెలిపారు. వారి సానుకూల ధోరణికి చాలా సంతోషంగా అనిపించిందది. అయితే కేజీయఫ్2, లాల్ సింగ్ చద్దా రెండు వేర్వేరు జోనర్లకు సంబంధించి చిత్రాలు. ప్రేక్షకులు రెండింటినీ ఆదరిస్తారు. కేజీయఫ్2కు తానే స్వయంగా ప్రచారం చేస్తాను. ఏప్రిల్ 14న తప్పకుండా ఆ సినిమాను థియేటర్లో చూస్తాను.`
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 28 Nov,2021 04:27PM