కాన్పూర్: భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య కాన్పూర్లోని గ్రీన్ పార్క్ స్టేడియంలో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్లో నాలుగో రోజు భారత్ సెకండ్ ఇన్నింగ్స్లో 7 వికెట్లు కోల్పోయి 234 పరుగుల వద్ద ఉండగా ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది. దాంతో భారత్ ఆధక్యం 283 పరుగులకు పెరిగింది. ఇక గెలవాలంటే న్యూజిలాండ్ 284 పరుగులు చేయాల్సి ఉంది.
నాలుగో రోజు ఉదయం పుజారా (22), అజింక్య రహానే (4) మయాంక్ అగర్వాల్ (17) మరోసారి నిరాశపరిచారు. ఆ తర్వాత జడేజా (0) డకౌట్ అవడంతో భారత్ పూర్తిగా కష్టాల్లో పడింది. అయితే శ్రేయాస్ అయ్యర్ (65), అశ్విన్ (32) జట్టును ఆదుకున్నారు. కాసేపటికి అశ్విన్ వెనుతిరిగినా వృద్ధిమాన్ సాహా (61 నాటౌట్)తో కలిసి అక్షర్ పటేల్ (28 నాటౌట్) రాణించడంతో భారత్ పెద్ద లక్ష్యాన్ని న్యూజిలాండ్ ముందు ఉంచగలిగింది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 28 Nov,2021 04:36PM