హైదరాబాద్ : ఉత్తరప్రదేశ్ లో ఆదివారం జరగాల్సిన టెట్ పరీక్షకు సంబంధంచిన ప్రశ్నాపత్రం లీక్ అయింది. దాంతో పరీక్షను ప్రభుత్వం రద్దు చేసింది. అయితే పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు చేరుకున్నాక పరీక్ష రద్దు చేయడంతో వారు మండిపడుతున్నారు.
యూపీ విద్యాశాఖ మంత్రి సతీష్ ద్వివేది మాట్లాడుతూ.. యుపీ టెట్ పరీక్షా పత్రం లీక్ అయినట్టు తమకు సమాచారం అందగానే పరీక్షను రదుద్ చేశామన్నారు. ఒక నెల వ్యవధిలో మళ్లీ పరీక్షను నిర్వహిస్తామని తెలిపారు. అభ్యర్థులపై భారం పడకుండా చేస్తామన్నారు. పేపర్ లీకేజీపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఇప్పటికే ఆర్డర్ జారీ చేశామని,.దర్యాప్తును ఉత్తరప్రదేశ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ విభాగానికి అప్పగించామని చెప్పారు. నిందితులను త్వరగా గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భద్రతల అదనపు డైరెక్టర్ జనరల్ ప్రశాంత్ కుమార్ మాట్లాడుతూ.. వచ్చే నెలలో మళ్లీ పరీక్షలను నిర్వహిస్తామన్నారు. అభ్యర్థులు మళ్లీ అప్లికేషన్ చేసుకోనవసరం లేదని తెలిపారు. అలాగే సెంటర్ల వద్ద ఉన్న అభ్యర్థుల తిరుగు ప్రయాణానికి ఉచిత బస్సు సౌకర్యం కల్పించామని... హాల్టికెట్ చూపించి బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని తెలిపారు.
మరోవైపు లీక్కు కారకులైన దాదాపు 23 మందిని అరెస్టు చేసినట్లు ప్రత్యేక కార్యాచరణ దళం (ఎస్టీఎఫ్) తెలిపింది. నిందితుల్లో కొందరు యూపీకి చెందినవారు కాగా.. మరికొందరు బిహార్కు చెందినవారు ఉన్నారని చెప్పింది. వారి నుంచి ప్రశ్నాపత్రాల ఫొటోలు, మొబైల్ ఫొన్స్ను స్వాధీనం చేసుకున్నట్టు వివరించింది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 28 Nov,2021 04:53PM