హైదరాబాద్ : మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటిస్తున్న చిత్రం ఆచార్య. ఈ సినిమాలో చరణ్ సిద్ద అనే పాత్రలో నటిస్తున్నారు. సిద్ధ అనే పాత్రకు సంబంధించిన టీజర్ ను తాజాగా చిత్రయూనిట్ విడుదల చేసింది. 'ధర్మస్థలికి ఆపద వస్తే ఆ అమ్మోరుతల్లే మాలో ఆవహించి ముందుకు పంపుద్ది` అంటూ చరణ్ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంది. ఇక చివరిలో ఓ చెరువు దగ్గర చిరుత పిల్ల నీళ్లు తాగుతుంటే తల్లి చిరుత వెనుక ఉన్న విజువల్ చూపించారు.. అచ్చం అలాగే చరణ్ నీళ్లు తాగుతుంటే.. చిరు చరణ్ వెనుక ఉన్న సీన్ మరింత హైన్ ని క్రియేట్ చేస్తుంది. ఇక ఆచార్య సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లుగా చిత్రయూనిట్ ప్రకటించింది. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా సురేఖ్ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ పతకాలపై భారీ బడ్జెట్తో నిర్మించారు. ఇక ఈ సినిమాలో చిరుకు జోడిగా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా, రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే నటిస్తోన్న విషయం తెలిసిందే.