హైదరాబాద్ : రెండురోజుల కాంగ్రెస్ వరి దీక్షలో ముగిసింది. సీనియర్ నేత జానారెడ్డి.. రేవంత్, కోమటిరెడ్డికి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్, బీజేపీలపై ఎంపీ రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన మాట్లాడుతూ..టీఆర్ఎస్, బీజేపీ కలిసి కొత్త నాటకానికి తెర తీశాయని మండిపడ్డారు. రైతు సమస్యలపై మాట్లాడతామని ఢిల్లీ వెళ్లిన కేసీఆర్.. సురేష్ రెడ్డి ఇంట్లో మందు తాగి విందు భోజనం చేసి వచ్చారని ఎద్దేవా చేశారు. మోడీని కలవలేదు, అపాయింట్ మెంట్ అడగలేదు అని అన్నారు. వరి మీద అవగాహన లేని కేటీఆర్, మహమూద్ అలీని కేంద్రమంత్రి దగ్గరకు పంపితే ఏం మాట్లాడతారని ప్రశ్నించారు. అలీకి వరి మూసీ నదిలో పండుతుందో, కాలువల కింద పండుతుందో కూడా తెలియదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రైతుల మీద కక్షతోనే కొనుగోళ్లలో జాప్యం చేస్తున్నారని.. కల్లాల్లో రైతుల చావులు ప్రభుత్వ హత్యలేనని చెప్పారు.
సిగ్గు తప్పిన బీజేపీ నేతలు రైతులను ఆదుకోకుండా.. ఫిరాయింపులపై ఆలోచనలు చేస్తున్నారని ఆరోపించారు. ఢిల్లీ వెళ్లొచ్చిన బీజేపీ నేత బండి సంజయ్ వరి మాటలు పక్కన పెట్టి.. విద్య, వైద్యంపై సంతకం అని కొత్త రాగం ఎత్తారని విమర్శించారు. ధాన్యం కొనుగోళ్లపై ఢిల్లీలో పోరాటం చేస్తామని ప్రకటించారు. రైతులను శాశ్వతంగా ఆదాని, అంబానీలకు బానిసలుగా మార్చే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. అలాగే సోమవారం గవర్నర్ను కలుస్తామన్న రేవంత్ రెడ్డి.. రైతుల సమస్యను పార్లమెంట్లో లేవనెత్తుతామని తెలిపారు. డిసెంబర్ 9 నుంచి 13లోపు ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద దీక్ష చేపడుతున్నట్టు ఈ సందర్భంగా చెప్పారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 28 Nov,2021 05:47PM