చెన్నై: తమిళనాడులోని పలు జిల్లాల్లో రేపు(సోమవారం) భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. తిరునల్వేలి, కన్యాకుమారి జిల్లాల్లో సోమవారం అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని ఐఎండీ తెలిపింది. అదేవిధంగా రామనాథపురం, తూత్తుకూడి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. దాంతో రాష్ట్ర రాజధాని చెన్నైలోని న తిరునల్వేలితోపాటు మొత్తం ఏడు జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సోమవారం సెలవు ప్రకటించారు.
Mon Jan 19, 2015 06:51 pm