ముంబయి : రైతులు ఉత్పత్తి చేసిన పంటకు కనీస మద్దతు ధర (ఎంఎస్పి)కి చట్టబద్ధత తీసుకురావాలంటూ భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేష్ తికాయిత్ డిమాండ్ చేశారు. ఆదివారం ముంబయిలోని ఆజాద్ మైదాన్లో కిసాన్ మహా పంచాయత్లో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రధాని మోడీ ఎంఎస్పికి మద్దతు పలికారని, రైతుల ప్రయోజనాలకు హామీనిచ్చేలా దేశ వ్యాప్త చట్టం తీసుకురావాలని అన్నారని గుర్తు చేశారు. ఇప్పుడు ఈ సమస్యపై మాట్లాడకుండా మోడీ సర్కార్ పారిపోతుందని విమర్శించారు. రైతులకు ఎంఎస్పి కల్పించేలా గ్యారంటీ చట్టాన్ని తీసుకురావాలన్నారు. వ్యవసాయ, కార్మిక రంగాలకు సంబంధించిన సంబంధించిన అనేక సమస్యలపై శ్రద్ధ అవసరమని.. వాటిని ఎత్తి చూపేందుకు దేశ వ్యాప్తంగా పర్యటిస్తామని పేర్కొన్నారు. అదేవిధంగా నూతన వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలంటూ ఏడాది కాలంగా చేపడుతున్న రైతు ఆందోళనల్లో ప్రాణాలు కోల్పోయిన అన్నదాతల కుటుంబాలకు పరిహారం అందించాలని తికాయిత్ డిమాండ్ చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm