హైదరాబాద్ : టాలీవుడ్లో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ కన్నుమూశారు. కరోనాతో గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన.. ఆదివారం సాయంత్రం మృతి చెందారు.
శివశంకర్ మాస్టర్ 1948 డిసెంబర్ 7న చెన్నైలో జన్మించారు. 1975లో వచ్చిన తమిళ చిత్రం పాట్టు భరతమమ్ చిత్రంతో ఆయన కెరీర్ మొదలుపెట్టారు. ఈ సినిమాకు ఆయన సహాయకుడిగా పనిచేశారు. ఆ తర్వాత కురువికూడు చిత్రంతో కొరియోగ్రాఫర్గా మారారు. ఆయన తన కెరీర్లో 10 భాషల్లోని 800కు పైగా సినిమాలకు డ్యాన్స్ మాస్టర్గా పనిచేశారు. అలాగే పలు సినిమాల్లోనూ ఆయన నటించారు. అలాగే శివశంకర్ మాస్టర్ .. బుల్లితెరపై పలు డ్యాన్స్ షోలకు జడ్జిగా వ్యవహరించారు. ఆయన మగధీర సినిమాలో ధీర.. ధీర పాటకు కోరియోగ్రఫీ చేయగా అందుకు ఆయనకు జాతీయ అవార్డు అందుకున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 28 Nov,2021 08:47PM