హైదరాబాద్: నూతనంగా ఎమ్మెల్సీలుగా ఎన్నికైన వారు ఆదివారం ముఖ్యమంత్రి కేసీఆర్ ను ప్రగతి భవన్ లో మర్యాదపూర్వకంగా కలిశారు. తమకు అవకాశం కల్పించినందుకు వారు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా వారికి శుభాకాంక్షలు తెలిపారు. సీఎం ను కలిసిన వారిలో ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి,పట్నం మహేందర్ రెడ్డి, శంభీపూర్ రాజు, కసిరెడ్డి నారాయణ రెడ్డి, కూచుకుళ్ల దామోదర్ రెడ్డి, వెంకట్రామిరెడ్డి తదితరులు ఉన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm