సిద్దిపేట: జిల్లాలోమరో విషాదం నెలకొంది. ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతు మరణించాడు. నంగునూరు మండలం బద్దిపడగ గ్రామంలోని వడ్ల కొనుగోలు కేంద్రంలో వడ్లూరి రాములు (45) అనే కౌలు రైతు గుండె పోటుతో మృతి చెందాడు. 10 రోజుల క్రితం కొనుగోలు కేంద్రానికి ధాన్యాన్ని రైతు తీసుకొచ్చాడు. రైతు మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Mon Jan 19, 2015 06:51 pm