హైదరాబాద్ : కుటుంబ కలహాలతో ఓ పసికందును గోడకేసి కొట్టి చంపాడో తండ్రి. ఈ దారుణ ఘటన ఢిల్లీలోని సమతా విహార్ లో ఈ నెల 3న జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రవి రాయ్ అనే వ్యక్తి, తన భార్య, మూడేండ్ల చిన్నారితో కలిసి సమతా విహార్ లో ఒక నెల నుంచి నివసిస్తున్నారు. ఈ నెల 3న భార్య భర్తల మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో రవిరాయ్.. నిద్రపోతున్న పసికందు కాలు పట్టుకొని లేపి, గోడకేసి కొట్టాడు. వెంటనే భార్య బయటకు వెళ్లి రావడంతో స్థానికులు గమనించి పోలీసులుకు సమాచారం అందించారు. బాలుడిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడిని అరెస్టు చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm