హైదరాబాద్ : ఓ స్కూటీలోకి దూరిన పాము కలకలం రేపిన ఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపినవ వివరాల ప్రకారం..
జిల్లా పరిషత్ పాఠశాల ఆవరణలో ఓ ఉపాధ్యాయురాలు స్కూటీని పార్క్ చేసింది. అయితే ఆ స్కూటీలోకి పాము దూరింది. అది చూసిన విద్యార్థులు .. ఉపాధ్యాయులకు చెప్పారు. దాంతో వారు స్కూటీ వద్దకు వెళ్లి కర్రతో శబ్దం చేసి పామును బయటకు రప్పించేందుకు ప్రయత్నించారు. అయినా పాము రాలేదు. దాంతో
పాములు పట్టే వ్యక్తితో పాటు బైక్ మెకానిక్ను పిలిపించారు. వారు స్కూటీలోని పరికరాలను ఒక్కొక్కటిగా తొలగించారు. దాంతో పాము బయటకు రాగా దాన్ని పట్టుకొని అడవిలో వదిలేశారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 07 Dec,2021 05:42PM