హైదరాబాద్: హైదరాబాద్ లోని నాంపల్లిలో ఉన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి ఉగ్రముప్పు పొంచి ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. పార్టీ కార్యాలయానికి వచ్చే వారిపై మానిటరింగ్ లేదని, సంబంధంలేని వ్యక్తులు కార్యాలయానికి వస్తున్నారని బీజేపీ తెలంగాణ నేతలకు ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపినట్టు తెలిసింది. జాగ్రత్తలు తీసుకోవాలని ఇంటెలిజెన్స్ వర్గాలు సూచించాయి. పార్టీ కార్యాలయానికి వెళ్లడం క్షేమం కాదని బీజేపీ ముఖ్యనేతలకు హెచ్చరించినట్టు సమాచారం.
Mon Jan 19, 2015 06:51 pm