హైదరాబాద్ : ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇటీవల వర్షాలకు పంట నష్టపోయిన రైతులు ఆవేదన చెందుతున్నారు. తాజాగా ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటనకు వచ్చిన వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి కాళ్ల మీద పడ్డారు కొందరు మహిళ రైతులు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. హనుమకొండ జిల్లాలోని పరకాల మండలంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుతో కలిసి మంత్రి నిరంజన్ రెడ్డి పర్యటించారు. అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. రైతులతో మాట్లాడి నష్టం వివరాలు తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. ఎవరూ అధైర్యపడొద్దు అన్నారు. అందరికీ అండగా ఉంటామని చెప్పారు. నర్సంపేట, పరకాల, భూపాలపల్లి, మంథనిలో మిర్చి దెబ్బతిందన్నారు. నష్టపోయిన రైతుల పంటల వివరాలను వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి సేకరిస్తారని చెప్పారు. రైతులకు న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. దేశ పాలకుల అసంబద్ధ విధానాల మూలంగా రైతులకు న్యాయం జరగడం లేదని, వ్యవసాయ విధానాలు సరిగా లేవు అని చెప్పారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 18 Jan,2022 04:03PM