హైదరాబాద్ : పంజాబ్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ఆ రాష్ట్రంలో కలకలం చెలరేగింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చరణ్ జిత్ సింగ్ చన్నీ మేనల్లుడు భూపేందర్ సింగ్ హనీ సహా పలువురు సన్నిహితుల ఇళ్లలో ఈడీ అధికారులు దాడులు చేశారు. భూపేందర్ సింగ్ నివాసం, కార్యాలయాలతో పాటు పంజాబ్ వ్యాప్తంగా మరో 10 చోట్ల ఏక కాలంలో దాడులు జరుగుతున్నాయి. అక్రమ ఇసుక మైనింగ్ కు సంబంధించి మనీలాండరింగ్ కేసులోనే ఈ తనిఖీలను జరుపుతున్నట్టు ఈడీ వర్గాలు వెల్లడించాయి. భూపేందర్ సింగ్ పంజాబ్ రియల్టర్స్ పేరుతో ఓ సంస్థను నిర్వహిస్తున్నారు. ఈ సంస్థ ద్వారా అక్రమంగా ఇసుక తవ్వకాలను చేపడుతూ కోట్లాది రూపాయల బ్లాక్ మనీని ఆర్జిస్తున్నట్టు ఆరోపణలు రావడంతో ఈడీ అధికారులు కేసు నమోదు చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm