కోల్కతా : కరోనా విజృంభిస్తుండడంతో గత రెండేండ్లుగా పెండ్లీలు ఇతర వేడుకలు వాయిదా పడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గతేడాది జరగాల్సిన ఓ పెండ్లి వాయిదా పడింది. అయితే ప్రస్తుతం వివాహం చేసుకోవాలనుకున్నా దేశంలో థర్డ్ వేవ్ మొదలైంది. దాంతో ఆ జంట వింత ఆలోచన చేసింది. గూగుల్ మీట్ ద్వారా పెండ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. అలాగే అతిథులకు విందును జోమాటో ద్వారా పంపాలని అనుకున్నారు.
అబ్బాయి సందీపన్ సర్కార్, అమ్మాయి అదితి దాస్ లు ఈ పాండమిక్ లో వెడ్డింగ్ను డిజిటల్గా మార్చుతున్నారు. జనవరి 24న వీరి వివాహం జరగనుండగా 450 మంది అతిథులకు ఆహ్వానం పంపినట్టు తెలుస్తోంది. గూగుల్ మీట్ ద్వారా అతిథులంతా పెండ్లిని తిలకించి యువజంటను ఆశీర్వదిస్తారు. ఇక పెండ్లి అనంతరం పెండ్లి భోజనం కోసం భారీ ఏర్పాట్లు చేశారు. అతిథులందరికీ జొమాటోలో భోజనం ఆర్టర్ చేసి వారి ఇండ్లకు డెలివరి పంపించనున్నారట.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 18 Jan,2022 05:46PM