అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై సుప్రీం కోర్టు సీరియస్ అయ్యింది. కొవిడ్ పరిహారం చెల్లింపుల్లో జాప్యంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆంధ్రప్రదేశ్తో పాటూ బీహార్ ప్రభుత్వంపైనా కోర్టు అసహనం తెలిపింది. ఏపీ, బీహార్ ప్రధాన కార్యదర్శులకు సమన్లు జారీ చేసింది. తమ ముందు హాజరుకావాలని జస్టిస్ ఎంఆర్ షా ధర్మాసనం ఆదేశించింది. మధ్యాహ్నం 2 గంటలకు హాజరవ్వాలని.. చట్టానికి ఎవరూ అతీతులు కాదని వ్యాఖ్యలు చేసింది. కరోనా మృతుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లింపుల్లో జాప్యంపై సుప్రీం కోర్టు గతంలో కూడా రాష్ట్ర ప్రభుత్వాలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా మృతుల కుటుంబాలకు జాతీయ విపత్తు నిర్వహణ చట్టం ప్రకారం రూ.4 లక్షల చొప్పున పరిహారం చెల్లించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్లపైవిచారణ జరిపింది. కరోనాతో చనిపోయివారి కుటుంబాలకు ఆర్థిక సాయం విషయంలో గతంలోనే సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. కనీస ప్రమాణాలు గల ఆర్థిక సహాయం అందజేయడానికి మార్గదర్శకాలను జారీ చేయాలని నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (ఎన్డీఎంఏ)ను ఆదేశించింది. పరిహారం చెల్లించాలని చట్టంలో విస్పష్టంగా ఉన్నందున దాన్ని అమలు చేసి తీరాలని తేల్చి చెప్పింది. ఎక్స్గ్రేషియా కింద ఎంత ఇవ్వాలన్నదానిపై తాము ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని, కేంద్రం కనీస ప్రమాణాలు గల మొత్తాన్ని నిర్ధారించాలని సూచించింది.
పరిహారం చెల్లింపులో వివక్ష ఉండకూడదని, దేశవ్యాప్తంగా ఒకే తరహా మొత్తం ఉండాలని పిటిషనర్ కోరారు. ఒక రాష్ట్రంలో ఎక్కువ, మరో రాష్ట్రంలో తక్కువగా పరిహారం ఉండకుండా కేంద్రమే ఏకరూప విధానాన్ని రూపొందించాలని విజ్ఞప్తి చేశారు. ‘పరిహారం నిర్ణయించడం వంటి వ్యవహారాల్లో సాధారణంగా న్యాయస్థానాలు జోక్యం చేసుకోవు.. అసాధారణత, ప్రభావం, విస్తృతి దృష్ట్యా రూ.4 లక్షల పరిహారం ఇవ్వాలని ఆదేశించలేం’ ఈ సందర్భంగా ధర్మాసనం పేర్కొంది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 19 Jan,2022 12:57PM