హైదరాబాద్ : సంగారెడ్డి జిల్లాలోని పాశమైలారం పారిశ్రామిక వాడలో కల్తీ పాలు తయారు చేస్తున్న పవిత్ర డైరీ ప్రయివేటు లిమిటెడ్ లో పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేశారు. అక్కడ కల్తీ పాలు, పెరుగు, పన్నీరును నిర్వాహకులు తయారు చేస్తున్నట్టు గుర్తించి 6వేల లీటర్ల కల్తీ మిల్క్ ఉత్పత్తులను పోలీసులు సీజ్ చేశారు. నిర్వాహకులపై కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా పటాన్ చెరు డీఎస్పీ భీంరెడ్డి మాట్లాడుతూ.. పవిత్ర డైరీలో కెమికల్ తో వివిధ కంపెనీల బ్రాండ్లతో పాల ఉత్పత్తులు తయారీ చేస్తున్నారన్నారు. నిర్వాహకులపై కేసు నమోదు చేశామని, పవిత్ర మిల్క్ డైరి మేనేజర్ ప్రసాద రావును విచారిస్తున్నట్టు తెలిపారు. సీజ్ చేసినట్లు భీంరెడ్డి వెల్లడించారు.
Mon Jan 19, 2015 06:51 pm