హైదరాబాద్: కుటుంబ కలహాలతో మనస్థాపం చెం దిన గృహిణి ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఈ ఘటన మీర్పేట్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. అల్మా్సగూడకు చెందిన కీర్తి సాయికుమార్, మాధురి భార్యాభర్తలు. ఇద్దరూ టైలరింగ్ చేస్తుంటారు. కాగా ఆదివారం రాత్రి భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. మనస్థాపానికి గురైన మాధురి అర్ధరాత్రి ఇంటి నుంచి వెళ్లి పోయింది. ఉదయం భార్య కనిపించక పోవడంతో సాయికుమార్ మీర్పేట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm