గాంధీనగర్: గుజరాత్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఆరోగ్య శాఖ మాజీ మంత్రి డాక్టర్ అనిల్ జోషియార(69 ) సోమవారం కన్నుమూశారు. కోవిడ్ అనంతర సమస్యలతో చెన్నైలోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించి మృతి చెందారు. తుదిశ్వాస విడిచారు. విమానంలో తన తండ్రి భౌతిక కాయాన్ని అహ్మదాబాద్లోని ఎస్వీపీఐ విమానాశ్రయానికి మంగళవారం ఉదయం 6.30 గంటలకు తీసుకు వస్తున్నట్టు ఎమ్మెల్యే కుమారుడు కేవల్ జోషియార తెలిపారు. అక్కడి నుంచి జోషియార స్వస్థలమైన చునా ఖాన్ గ్రామానికి తీసుకు వెళ్లి అంత్యక్రియలు నిర్వహిస్తారు.
Mon Jan 19, 2015 06:51 pm