హైదరాబాద్ : బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఈ నెల 2న హైదరాబాద్ కు రానున్నారు. అందుకు సంబంధించిన షెడ్యూల్ ఖరారైంది. జులై 2న హైదరాబాద్ లోని బేగంపేట విమానాశ్రయానికి మోడీ చేరుకుంటారు. అక్కడి నుంచి రాజ్భవన్కు వెళ్తారు. అనంతరం రాజ్భవన్ నుంచి రోడ్డు మార్గం ద్వారా నోవాటెల్ హోటల్కు ప్రధాని చేరుకుంటారు. జులై 2, 3 తేదీల్లో ప్రధాని మోడీ నగరంలోనే ఉండి రాజ్భవన్లో బస చేస్తారు. తిరిగి 4వ తేదీ ఉదయం ఆంధ్రప్రదేశ్కు వెళ్తారు.
Mon Jan 19, 2015 06:51 pm