హైదరాబాద్ : సెల్లార్ గుంత తీస్తుండగా గోడ కూలడంతో ముగ్గురు మృతి చెందారు. ఈ విషాద ఘటన రంగారెడ్డి జిల్లా నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పుప్పాలగూడలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే.. సెల్లార్ కోసం స్లాబ్ వేసేందుకు రాడ్ పనులు చేస్తుండగా పైనుంచి ఒక్కసారిగా గోడకూలి మట్టికుప్ప కార్మికులపై పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. కొందరు ప్రమాదం నుంచి బయటపడగా మరికొంతమంది మట్టికింద చిక్కుకున్నట్టు తెలిసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయచర్యలు చేపట్టారు. నిర్మాణ సంస్థ నిర్లక్ష్యమే ఇందుకు కారణమని కార్మికులు చెబుతున్నారు. మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
Mon Jan 19, 2015 06:51 pm