హైదరాబాద్ : మేడ్చల్ జిల్లాలో పేలుడు కలకలం సృష్టించింది. బహదూర్పల్లిలోని ఓ కన్వెన్షన్ హాలులో ఓ డబ్బాను బయటకు తీసుకువస్తున్న సమయంలో పేలుడు సంభవించినట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.
Mon Jan 19, 2015 06:51 pm