వికారాబాద్ : వికారాబాద్ జిల్లాలో సమీకృత కలెక్టరేట్ను ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం ప్రారంభించారు. కలెక్టరేట్లో సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు చేశారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, కొప్పుల మహేశ్వర్ రెడ్డి, కాలే యాదయ్య, పైలట్ రోహిత్ రెడ్డి, ఎమ్మెల్సీలు సురభి వాణిదేవి, పట్నం మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. :
అలాగే వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కూడా సీఎం కేసీఆర్ ప్రారంభించారు. పార్టీ ఆఫీసు లోపల సీఎం ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ జెండాను కూడా ఆయన ఆవిష్కరించారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 16 Aug,2022 05:11PM