హైదరాబాద్: నగరంలో జరుగుతున్న జీఎస్టీ కౌన్సిల్ సమావేశాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించిన వామపక్ష నేతలను పోలీసులు శనివారం అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. సీపీఐ నేత నారాయణ సహా పలువురు వామపక్ష నేతలు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ సమక్షంలో జరుగుతున్న జీఎస్టీ కౌన్సిల్ సమావేశాన్ని అడ్డుకునేందుకు బయలుదేరారు. వీరిని మాదాపూర్లో పోలీసులు అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm