కొవ్వూరు: పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరులో దారుణ హత్య జరిగింది. ఒక యువకుడిని పట్టపగలు నడిరోడ్డుపై కొందరు దుండగులు నరికి చంపారు. కొవ్వూరుకి చెందిన గంధం బుచ్చిబాబు అనే యువకుడు రాడ్ బెండింగ్ పని చేస్తుంటాడు. ఇవాళ సాయంత్రం ఇంటి దగ్గర ఉన్న బుచ్చిబాబుని కొందరు స్నేహితులు బస్టాండ్ సెంటర్కు తీసుకువచ్చారు. అక్కడ కొంతసేపు వారి మధ్య వాగ్వాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. ఆ తరువాత వారు బుచ్చిబాబుని కత్తులతో నరికి చంపి పరారయ్యారు. హంతకులు మద్యం మత్తులో ఉన్నారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm