హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీ పీహెచ్డీలో ప్రవేశాలకు నిర్వహించిన పరీక్షా ఫలితాలను అధికారులు విడుదల చేశారు. ఈ ఏడాది ఏప్రిల్లో మొత్తం 60 సబ్జెక్టులలో ఈ పరీక్షలను విడతల వారీగా నిర్వహించారు. పరీక్షలకు 24,368 మంది దరఖాస్తులు చేసుకోగా, 16,501 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఉత్తీర్ణతా శాతాన్ని మాత్రం అధికారులు వెల్లడించలేదు. వెంటనే ఉత్తీర్ణతా శాతాన్ని డిపార్ట్మెంట్ల వారీగా ప్రకటించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm