తిరుమల: శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కొలువై ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తులు రద్దీగా ఉన్నారు. మొత్తం భక్తులు రెండు కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకున్న ఆలయ సిబ్బంది శ్రీవారి దర్శనానికి సంబంధించిన వివరాలను తెలియజేశారు. కంపార్టుమెంట్లలో వేచి ఉన్న భక్తులకు శ్రీవారిని దర్శించుకునేందుకు 2 గంటల సమయం పడుతుందని, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంట సమయం పడుతుందని వారు తెలిపారు. నిన్న శ్రీవారిని 59,109 మంది భక్తులు దర్శించుకున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm