అహ్మదాబాద్: ప్రతిదేశానికి కలులు ఉండాలని.. వాటిని సాకారం చేసుకోవాలని ప్రధాని మోడీ అన్నారు. అహ్మదాబాద్లో బుల్లెట్ రైలు మార్గానికి శంకుస్థాపన అనంతరం ఆయన ప్రసంగించారు. భారత్ చిరకాల స్వప్నం పట్టాలు ఎక్కనుందని ప్రధాని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు ఉద్యోగాలను, వేగాన్ని, పర్యావరణ పరిరక్షణను, జపాన్ స్నేహాన్ని తీసుకువస్తుందని అన్నారు. ఇరుదేశాల మధ్య సంబంధాలకు ఇది నిదర్శనమన్నారు. ఈ ప్రాజెక్టులో ఎటువంటి ఇబ్బందులు రాకూడదని జపాన్ ప్రధాని అబే నిశ్చయించుకున్నారని చెప్పారు. పూర్వం నదుల వద్ద నాగరికత ఉండేదని.. తర్వాత రహదారులు ఉన్న చోట ప్రజలు నివసించారని.. ఇప్పుడు హైస్పీడ్ కారిడార్లు ఉన్నచోటే అభివృద్ధి ఉంటోందని ప్రధాని వివరించారు. రైల్వే లైన్లు వచ్చిన తర్వాతే అమెరికా అభివృద్ధి సాధించిందని అన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm