హైదరాబాద్ : తెలంగాణ జాగృతి న్యూజిలాండ్ అధ్యక్షురాలు అరుణ జ్యోతి ముద్దం ఆధ్వర్యంలో జరుపుతున్న బతుకమ్మ వేడుకల పోస్టర్ ను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎంపీ కల్వకుంట్ల కవిత ఆవిష్కరించారు. న్యూజిలాండ్ ప్రతినిధులు ఇవాళ హైదరాబాద్ లో ఎంపీ కవితను కలిశారు. న్యూజిలాండ్ బతుకమ్మ వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లపై అక్కడి ప్రతినిధులు ఎంపీ కవితకు వివరించారు. న్యూజిలాండ్ లో బతుకమ్మ సంబురాలను ఘనంగా నిర్వహించాలని, బతుకమ్మ వేడుకలకు ఇతర రాష్ట్రాల వారిని కూడా ఆహ్వానించాలని ఎంపీ కవిత న్యూజిలాండ్ ప్రతినిధులకు సూచించారు. తెలంగాణ జాగృతి న్యూజిలాండ్ శాఖ ప్రతినిధులు రాంరెడ్డి, రాజీవ్ రెడ్డి, తెలంగాణ జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజీవ్ సాగర్, యూత్ రాష్ట్ర కన్వీనర్ కోరబోయిన విజయ్ కుమార్, దూసరి బాలాజి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm