నల్గొండ : జిల్లాలో ఘోరం జరిగింది. కూతురిని తల్లిదండ్రులు హత్య చేశారు. 13 ఏళ్ల కూతురు పలువురు యువకులతో సన్నిహితంగా ఉంటుందన్న అనుమానంతో తండ్రి నరసింహ కూతురి గొంతు నులిమి చంపేశాడు. అంతరం ఇంట్లోనే తగలబెట్టి ఆత్మహత్యగా చిత్రీకరించారు. పోలీసు విచారణ లో వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. నిందితులు నర్శింహ, లింగమ్మను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఈ ఘటన చింతపల్లి మండలం టేదెడు లో చోటు చేసుకుంది.
Mon Jan 19, 2015 06:51 pm