చిన్నకోడూరు: సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం మాటిన్ల గ్రామంలో రూ. 4.5కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులను మంత్రి హరీష్రావు, మహారాష్ట్ర ఎమ్మెల్సీ మితేష్ ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో హరీష్రావు మాట్లాడుతూ.. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన డయాలసిస్, ఆర్థోపెడిక్ కేంద్రాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వినియోగించుకోవాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలకు వచ్చిన మహిళలకు అందుతున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm