కర్నూలు: కర్నూలులో భారతయాత్ర పేరుతో జరిగిన ర్యాలీలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, నోబెల్ గ్రహీత కైలాష్ సత్యార్థి పాల్గొన్నారు. రాజ్విహార్ కూడలి వద్ద నుంచి ఏపీఎస్పీ బెటాలియన్ మైదానం వరకు ఈ యాత్ర జరిగింది. అనంతరం ఏపీఎస్పీ బెటాలియన్ మైదానంలో 'బాలల భద్రతే భారత భద్రత' పేరుతో బహిరంగ సభ జరగనుంది. ఈ కార్యక్రమంలో చంద్రబాబునాయుడు, కైలాష్ సత్యార్థిలు ప్రసంగించనున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm