సిర్సా: డేరా సచ్చా సౌదా ప్రధాన కార్యాలయంలో ఇటీవల పోలీసులు సోదాలు చేశారు. అయితే సిర్సాలో ఉన్న హెడ్క్వార్టర్స్లో సుమారు 600 అస్థిపంజరాలను గుర్తించినట్లు తెలుస్తున్నది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) సభ్యులు ఈ విషయాన్ని వెల్లడించినట్లు ఓ మీడియా సంస్థ పేర్కొన్నది. డేరా క్యాంపస్లో భారీ సంఖ్యలో శవాలను పాతిపెత్తినట్లు ఆరోపణలు వస్తున్నాయి. మృతదేహాలను పాతి పెట్టిన చోట చెట్లను కూడా నాటారు. ఆ చెట్లు ఇప్పుడు కొన్ని చోట్ల భారీ వృక్షాలుగా మారినట్లు గుర్తించారు. డేరాకు వచ్చే భక్తులు మృతిచెందితే, వారి మృతదేహాలను అక్కడే పాతిపెట్టాలని, దాని ద్వారానే మోక్షం వస్తుందని బాబా గుర్మీత్ చెప్పేవాడట. రెండు రేప్ కేసుల్లో బాబా గుర్మీత్ ప్రస్తుతం రోహతక్ జైలులో శిక్షను అనుభవిస్తున్నాడు. అతనికి 20 ఏళ్ల జైలు శిక్షను విధించారు.
Mon Jan 19, 2015 06:51 pm