హైదరాబాద్: సుకుమార్ దర్శకత్వంలో రామ్చరణ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం రంగస్థలం 1985. ప్రస్తుతం జుబ్లీహిల్స్లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. కాగా ఈ చిత్రం సెట్లో మెగాస్టార్ చిరంజీవి, జక్కన్న ఎస్.ఎస్. రాజమౌళి సందడి చేశారు. బుధవారం సెట్కు వెళ్లిన వీరిద్దరు యూనిట్ సభ్యులతో కాసేపు సరదాగా గడిపినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా తీసిన ఫొటోలు ప్రస్తుతం సోషల్మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మగధీర్ణ తర్వాత చెర్రీ-జక్కన్న కాంబినేషన్లో మరో చిత్రం వచ్చే అవకాశం ఉన్నట్లు వదంతులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో చెర్రీ సినిమా సెట్కు జక్కన్న వెళ్లడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.
Mon Jan 19, 2015 06:51 pm