అనంతపురం: ధర్మవరం మండలం కత్తేకొట్టాలలో విషాదం చోటుచేసుకుంది. నీటికుంటలో పడి ఇద్దరు చిన్నారులు మృతిచెందారు. పూర్తి వివరాల్లోకి వెళ్లితే... ఇంటి బయట ఆడుకుంటూ ప్రభాస్(11), మనోహర్(10) నీటికుంటలో పడి దుర్మణపాలైయారు. నీటిగుంటలో పడ్డ చిన్నారుల మృతదేహాలను గుర్తించిన స్థానికులు బయటకు తీసి.. కుటుంబసభ్యులకు అప్పగించారు. ఈ ఘటనతో కత్తేకొట్టాలలో విషాదఛాయలు అలముకున్నాయి. కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరై రోదిస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm