భద్రాద్రికొత్తగూడెం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయ రాజగోపురంలోని శిల విరిగింది. దీంతో శిల విరిగిన ప్రాంతాన్ని పురావస్తు శాఖ అధికారులు పరిశీలించారు. పరిశీలనలో భాగంగా రాజగోపురానికి బీటలు వచ్చి వర్షంలో నానడం వల్ల శిల విరిగిపోయినట్లు వాళ్లు నిర్ధారించారు. ఇక నుంచి ఇటువంటి ఘటనలు జరగకుండా ఇనుప మెస్ పెట్టి జాగ్రత్తలు తీసుకోవాలని పురావస్తు అధికారులు ఆలయ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో స్థపతి వల్లి నాయగం, ఎస్ఈ వెంకట్రావ్, ఏడీసీ శ్రీనివాస్, ఈఈ నర్సింగరావు, పురావస్తు శాఖ ప్రొఫెసర్ పాండురంగారావు, రామాలయ ఈవో ప్రభాకర్ శ్రీనివాస్, తదితరలు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm