భద్రాద్రికొత్తగూడెం: టీబీజీకేఎస్లోకి వివిధ కార్మిక సంఘాల నేతలు భారీగా చేరుతున్నారు. సింగరేణి కొత్తగూడెం ఏరియా రుద్రంపూర్ కాలనీలోని సింగరేణి గౌతమ్పూర్ కమ్యూనిటీ హాల్ ప్రాంగణంలో సాయంత్రం వివిధ కార్మిక సంఘాలకు చెందిన సుమారు 250 మంది టీబీజీకేఎస్లో చేరారు. వారిని ఎమ్మెల్యే జలగం వెంకటరావు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మండలి విప్ పల్లా రాజేశ్వరరెడ్డి కండువాలు కప్పి టీబీజీకేఎస్లోకి సాదరంగా ఆహ్వానించారు.
Mon Jan 19, 2015 06:51 pm