ఇండోర్ : ఆసీస్తో జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్లో నేడు జరిగిని మూడో వన్డేలో భారత్ ఐదు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి సిరీస్ను కైవసం చేసుకుంది. మొదట టాస్ గెలిచిన ఆసీస్ బ్యాటింగ్ ఎంచుకోగా నిర్ణిత 50 ఓవర్లకు ఆరు వికెట్లు కోల్పోయి 293 పరుగులు చేసింది. దీంతో భారత్కు 294 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించగా భారత్ 47.5 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 294 పరుగులు చేసి ఘన విజయం సాధించింది. భారత బ్యాట్స్ మెన్లలో ఒపెనర్లు రోహిత్ శర్మ 71, రహానే 70 పరుగులు చేయాగా యువ ఆటగాడు పాండ్యా 78 పరుగులు చేశాడు.
Mon Jan 19, 2015 06:51 pm